News January 11, 2025
కృష్ణా: ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మందికి లబ్ధి
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కింద రూ.788 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. కాగా ఎన్టీఆర్ జిల్లాలో 605, కృష్ణాలో 508 సచివాలయాల పరిధిలో వేలాదిమందికి ఈ పథకం కింద లబ్ధి అందనుంది. గత ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలలో పీజీ చదివిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ నిలిపివేయగా కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తూ నిధులు విడుదల చేసింది.
Similar News
News January 19, 2025
కృష్ణా: ఈ నెల 27తో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు
కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సులు(2024- 25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుండి Y23 బ్యాచ్లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 27లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
News January 19, 2025
విజయవాడ మీదుగా భువనేశ్వర్కు స్పెషల్ ట్రైన్
ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- భువనేశ్వర్(BBSR)కు నం.08550 స్పెషల్ రైలు నడుపుతున్నట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఆదివారం చర్లపల్లిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:55కు విజయవాడ, సోమవారం ఉదయం 2:15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ రైలు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుందన్నారు.
News January 18, 2025
నందిగామ మండలంలో దారుణ హత్య
నందిగామ మండల పరిధిలోని పల్లగిరి గ్రామ సమీపంలో సుబాబుల తోటలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తిని కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి స్నేహితులతో సుబాబులు తోటలో మద్యం సేవించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.