News December 11, 2024
కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB) – హౌరా(HWH)(నం.06585) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 10.15 గంటలకు SMVBలో బయలుదేరే ఈ ట్రైన్ అదే రోజు రాత్రి 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 15వ తేదీన రాత్రి 9.45 గంటలకు HWH చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.
Similar News
News January 20, 2025
విజయవాడ మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయవాడ మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News January 19, 2025
విజయవాడ: దేవాలయాలపై చట్ట సవరణ చేయాలని వినతి
ఇటీవల విజయవాడ సమీపంలో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షాను VHP కేంద్రీయ ఉపాధ్యక్షుడు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు విజయవాడలో కలిశారు. ఇటీవల నిర్వహించిన హైందవ శంఖారావ సభ వివరాలను అమిత్ షాకు అందించారు. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు చట్ట సవరణ చేయాలని కోరారు.
News January 19, 2025
అమిత్షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు
కేంద్రమంత్రి అమిత్షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు.