News October 23, 2024
కృష్ణా: ఫీజు చెల్లింపుకు రేపే చివరి తేదీ

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
Similar News
News October 27, 2025
కృష్ణా: తుపాన్ బీభత్సం.. చిగురుటాకులా వణికిన దివిసీమ

‘మొంథా’ తుపాన్ ప్రభావం వల్ల దివిసీమ ప్రజలు కలవరపడుతున్నారు. గతంలో కృష్ణా జిల్లాను కకావికలం చేసిన 1977 తుపానును గుర్తుచేసుకుంటున్నారు. దీంతో దివిసీమ చిగురుటాకులా వణుకుతోంది. ఆ సంవత్సరం నవంబర్ 19న తుపాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొన్ని ఊర్లు సముద్రంలో కలిసిపోయాయి.
News October 27, 2025
మెుంథా తుఫాన్ ఇంకా ఎంత దూరం ఉందంటే.!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
News October 27, 2025
కృష్ణా: తుఫాన్ భయం.. పంట రక్షణలో రైతులు నిమగ్నం

తుఫాన్ ప్రభావం కొనసాగుతుండడంతో ముందుగానే చేతికి వచ్చిన పంటను భద్రపరచుకునే పనుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా నిమగ్నమయ్యారు. వర్షం ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆందోళనతో పంటను ఎండబెట్టి రాశులుగా చేసి భద్రపరుచుకుంటున్నారు. తుఫాన్ కారణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాశులుగా వేసి తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.


