News April 5, 2025

కృష్ణా: బాబు జగ్జీవన్ రామ్‌కి కలెక్టర్ నివాళి  

image

దేశానికి అపార సేవలందించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం మచిలీపట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు. 

Similar News

News April 14, 2025

విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

image

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.

News April 14, 2025

మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ వద్ద హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. కొక్కిలిగడ్డకు చెందిన రాయన కృష్ణ తేజస్ (18), నాగ జశ్వంత్ బైకుపై మోపిదేవి వెళ్లేందుకు హైవే పైకి రాగానే వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తేజస్ మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగ జస్వంత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 14, 2025

కృష్ణా: ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదు- డీఎస్పీ

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లాలో బైక్ ర్యాలీలు, డీజే సౌండ్ బాక్స్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మచిలీపట్నం డీఎస్పీ రాజా పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరాలతో నిశితంగా పర్యవేక్షిస్థామన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!