News February 10, 2025
కృష్ణా: ‘మద్యం దుకాణాల లాటరీ వాయిదా’

జిల్లాలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కల్లుగీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 12 దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించడం జరిగిందన్నారు. కోడ్ కారణంగా లాటరీ తీసే కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.
Similar News
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.
News October 30, 2025
కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News October 30, 2025
అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.


