News June 21, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా డిబ్రుగఢ్(DBRG)-కన్యాకుమారి(CAPE) మధ్య ప్రయాణించే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇకపై ప్రతి రోజు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.22504 DBRG-CAPE ట్రైన్‌ను జూలై 8 నుంచి నం.22503 CAPE-DBRG ట్రైన్‌ను జూలై 12 నుంచి ప్రతిరోజూ నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

Similar News

News November 22, 2025

కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

News November 22, 2025

కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

News November 22, 2025

ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

image

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్‌లెవల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్‌ కలెక్టర్‌, ముడా ఇంఛార్జి వైస్‌ ఛైర్మన్‌, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నవీన్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్‌ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్‌వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.