News July 26, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు గమనిక

విజయవాడ నుంచి తెనాలి వెళ్లే మెము రైళ్లను ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.07279 విజయవాడ-తెనాలి, నం.07575 తెనాలి-విజయవాడ మెము రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించింది.
Similar News
News October 14, 2025
కృష్ణానది నుంచి నేరుగా రక్షిత తాగునీరు: ఎంపీ

జల్జీవన్ పథకం కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
News October 13, 2025
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 13, 2025
మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్కు 32 అర్జీలు

కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 32 అర్జీలు అందాయి. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తప్పక పరిష్కార చర్యలు చేపడతామని అర్జీదారులకు తెలియజేశారు. చట్ట పరిధిలో పరిష్కార చర్యలు ఉంటాయన్నారు.