News March 4, 2025
కృష్ణా: వాలంటీర్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 27, 2025
కృష్ణా: జోగి రమేశ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యం తయారీ.!

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన అద్దేపల్లి జనార్ధనరావు, జగన్మోహనరావులను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో శుక్రవారం వీరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.
News December 25, 2025
మచిలిపట్నం: కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
News December 25, 2025
మచిలిపట్నం: కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.


