News December 24, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ 1వ సెమిస్టర్(2024- 25 విద్యాసంవత్సరం) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను 2025 JAN 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ సిబ్బంది తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు JAN 8లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలన్నారు.
Similar News
News January 6, 2026
ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.
News January 6, 2026
బండారు దత్తాత్రేయకు గన్నవరంలో ఘన స్వాగతం

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు కానూరి శేషు మాదవి, నాదెండ్ల మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బండారు దత్తాత్రేయ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
News January 6, 2026
కృష్ణా: కోడి పందేల నిషేధంపై కరపత్రల ఆవిష్కరణ

జిల్లాలో కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డీ.కే.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీసీఏ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కోడిపందేల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.


