News October 27, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఆదివారం నుంచి విశాఖ- విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నూతన సర్వీసులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. ఈ రెండు కొత్త సర్వీసులతో కలిపి విశాఖ-విజయవాడ మధ్య విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Similar News

News December 22, 2025

కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

image

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.

News December 22, 2025

నేడు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.

News December 22, 2025

నేడు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.