News June 29, 2024
కృష్ణా: సహాయం చేయడానికి వెళ్లి దుర్మరణం
నందిగామ మం. ఐతవరంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర టోల్గేట్లో పని చేసే సంకురామరాజు, అతని తండ్రి మాధవరావు ఐతవరం హైవే వద్ద నివాసం ఉంటారు. లారీ ప్రమాదం జరిగినట్లు గుర్తించి టోల్ ప్లాజాకు ఫోన్ చేస్తూ వారిద్దరూ లారీ ముందు నిల్చున్నారు. ఈ క్రమంలో ఓ లారీ వెనకవైపు నుంచి ప్రమాదం జరిగిన లారీని ఢీకొట్టింది. వీరిపైనుంచి ఆ వాహనం వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News September 21, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
విజయవాడ మీదుగా పుదుచ్చేరి(PDY)-హౌరా(HWH) మధ్య ప్రయాణించే 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు రాజమండ్రిలో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు రాజమండ్రిలో ఇచ్చిన ఈ స్టాప్ను పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు నం.12868 PDY-HWH రైలు ఈ నెల 25 నుంచి, నం.12867 HWH-PDY రైలు ఈ నెల 22 నుంచి రాజమండ్రిలో ఆగుతాయన్నారు.
News September 21, 2024
కృష్ణా: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y22 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 30 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
News September 21, 2024
తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు తిరుపతి(TPTY)-విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ నం.22708 TPTY-VSKP రైలును ఈ నెల 29న, నం.22707 VSKP-TPTY రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.