News July 18, 2024
కృష్ణా: హత్య కేసులో ట్విస్ట్… హంతకురాలు తల్లే
పమిడిముక్కల మండలం తాడంకిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం పోలీస్ స్టేషన్లో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తాడంకి గ్రామానికి చెందిన రాంబాబును పచ్చడి బండతో తలపై కొట్టి తల్లి హత్య చేసిందన్నారు. తాగిన మత్తులో పలుమార్లు తల్లిపై అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడిని హత్య చేసిన తల్లి పద్మను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామన్నారు.
Similar News
News October 15, 2024
కృష్ణా: మద్యం షాపుల లాటరీలో ఆసక్తికర విశేషాలు
➢ ఎన్టీఆర్ జిల్లాలో 20 మంది మహిళలకు దుకాణాలు
➢ పెనుగంచిప్రోలులోని 5 షాపుల్లో 3 షాపులు తెలంగాణ వారికే.
➢ పెనుగంచిప్రోలు పెట్రోల్ బంకులో పనిచేసే బాయ్కు షాపు.
➢ బాపులపాడుకు చెందిన పరుచూరి నరేశ్కు 4 షాపులు.
➢ గుడివాడకు చెందిన రామకృష్ణ మూడు షాపులు కైవసం
➢ మచిలీపట్నంలోని రెండు షాపులు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన వారికి దక్కాయి.
➢ మధ్యప్రదేశ్కు చెందిన ఒకే కుటుంబంలోని వారికి విజయవాడలో రెండు షాపులు.
News October 15, 2024
కృష్ణా: భార్యా భర్తలకు 9 షాపులు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సజావుగా ముగిసింది. అయితే వ్యక్తిగతంగా షాపులు వరించిన వారి నుంచి జోరుగా బేరసారాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులు వేయొచ్చన్న నిబంధనలతో భారీగా సిండికేట్లగా ఏర్పడి షాపులు దక్కించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన భార్యభర్తలు నగరానికి చెందిన వారితో కలిపి 480 షాపులకు దరఖాస్తు చేస్తే ఈ సిండికేట్కు 9 దక్కాయి.
News October 14, 2024
నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.!
కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కంకిపాడుకి చేరుకుంటారు. అనంతరం 10 నుంచి 11:30 వరకు కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:30కి కంకిపాడు నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.