News March 22, 2025

కృష్ణా: 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% హాజరు 

image

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. 

Similar News

News March 29, 2025

కృష్ణా: MBA,MCA పరీక్ష ఫలితాలు విడుదల

image

కృష్ణ యూనివర్సిటీ (KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన MBA,MCA కోర్సుల 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలపై అధికారిక వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని KRU సుచించింది. రీవాల్యుయేషన్ కై ఏప్రిల్ 15 లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 29, 2025

కృష్ణా: 10వ తరగతి పరీక్ష తేదీ మార్పును గమనించండి: DEO 

image

ఈనెల 31న నిర్వహించాల్సిన 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసినట్టు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 31వ తేదీ రంజాన్ పర్వదినం సందర్భంగా ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజున నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మార్పును విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించి సహకరించాలని డీఈఓ కోరారు. 

News March 29, 2025

అవినిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు 

image

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవినిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలాది లభ్యమయ్యాయి. మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు. 

error: Content is protected !!