News March 19, 2025

కృష్ణా: 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతం

image

10వ తరగతి పరీక్షల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,504 మంది విద్యార్థులకు గాను 21,026 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 97.78% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు. 

Similar News

News October 27, 2025

కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

image

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.

News October 27, 2025

కృష్ణా జిల్లాలో 188 రిలీఫ్ క్యాంప్‌లు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో 188 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మచిలీపట్నం డివిజన్ లో 93 కేంద్రాలు ఏర్పాటు చేయగా 534 మందిని, ఉయ్యూరు డివిజన్‌లో 61 కేంద్రాలకు గాను 141 మందిని తరలించారు. గుడివాడ డివిజన్‌లో 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కరిని కూడా తరలించలేదు.

News October 27, 2025

కృష్ణా: మెంథా తుఫాన్.. ప్రత్యేక అధికారులు జాబితా ఇదే.!

image

మచిలీపట్నం-7093930106, అవనిగడ్డ-9704701900, కోడూరు-9490952125, నాగయలంక-8639226587, చల్లపల్లి-9100084656, కృత్తివెన్ను-8331056798, మోపిదేవి-8008772233, బంటుమిల్లి-9100109179, ఘంటసాల-9848933877, గూడూరు-9849588941, పెడన-9154409536, బాపులపాడు-9849906009, గన్నవరం-8333991288, గుడివాడ-8686935686, గుడ్లవల్లేరు-9052852666, తోట్లవల్లూరు-9492555104, ఉయ్యూరు-7995086773, నందివాడ-9989092288.