News April 11, 2025
కృష్ణా: 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

సముద్రంలో మత్స్య సంపద సంతానోత్పత్తి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎటువంటి యాంత్రిక పడవల ద్వారా సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News April 20, 2025
మచిలీపట్నం: అఘోరిపై ఆడిషన్ ఎస్పీకి ఫిర్యాదు

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి శ్రీనివాసపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు దోవా గోవర్ధన్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు.
News April 19, 2025
పీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి: కలెక్టర్ బాలాజీ

అమరావతిలో మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
News April 19, 2025
కోడూరు: తాబేలు పిల్లలను విడిచిపెట్టిన జాయింట్ కలెక్టర్

అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను కృష్ణాజిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ సాగరంలోకి వదిలిపెట్టారు. శనివారం కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కుటుంబ సమేతంగా హంసలదీవి శివారు పాలకాయతిప్ప బీచ్ వద్ద అటవీ శాఖ వారి సంరక్షణలో ఉన్న గుడ్ల సేకరణ,సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కృత్రిమంగా విధానంలో పొడిగించిన తాబేళ్ల పిల్లలను గీతాంజలి శర్మ సముద్రంలోకి విడిచిపెట్టారు.