News December 7, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News January 19, 2025

విజయవాడ: దేవాలయాలపై చట్ట సవరణ చేయాలని వినతి

image

ఇటీవల విజయవాడ సమీపంలో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను VHP కేంద్రీయ ఉపాధ్యక్షుడు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు విజయవాడలో కలిశారు. ఇటీవల నిర్వహించిన హైందవ శంఖారావ సభ వివరాలను అమిత్ షాకు అందించారు. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు చట్ట సవరణ చేయాలని కోరారు.

News January 19, 2025

అమిత్‌షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు

image

కేంద్రమంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు. 

News January 19, 2025

విజయవాడ: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమిస్తూ శనివారం తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2024 ఎన్నికలలో బాపట్ల జిల్లా వేమూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్.. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ చేతిలో పరాజయం పొందారు. కాగా అశోక్ నియామకంతో పాటు మరో 5 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను వైసీపీ నియమించింది.