News February 26, 2025
కృష్ణా: 27న విద్యా సంస్థలకు సెలవు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 27న జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మంగళవారం తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గ్రహించి 27న తమ పాఠశాలలకు సెలవు ప్రకటించాలన్నారు.
Similar News
News November 29, 2025
కృష్ణా: NMMS పరీక్షల హాల్ టికెట్లపై Update

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకులు కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో పొందుపరిచినట్లు DEO రామారావు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ U-DISE కోడ్ ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు.
News November 28, 2025
స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.
News November 28, 2025
కృష్ణా జిల్లాకు దిత్వా తుఫాన్ హెచ్చరిక.!

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా కృష్ణా జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్కు, దిత్వా తుఫాన్కు కొంత తేడా ఉంటుందని, మొంథా తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలులు దిత్వా తుఫాన్ కారణంగా ఉండవన్నారు. కేవలం అధిక వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


