News December 1, 2024
కృష్ణా: CM చంద్రబాబు నిర్ణయంపై మీరేమంటారు

ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు ఫోన్ చేసి పింఛన్ అందిందా లేదా అని అడిగే వ్యవస్థను తీసుకొస్తామని CM చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో IVRS ద్వారా ఆయన పథకాల లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కాగా ఉమ్మడి కృష్ణాలో 4,70,210 మంది పింఛన్ లబ్దిదారులుండగా రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఉన్నారు. సీఎం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా మీ స్పందన ఏమిటో తెలియజేయండి.
Similar News
News February 10, 2025
కృష్ణా: ‘మద్యం దుకాణాల లాటరీ వాయిదా’

జిల్లాలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కల్లుగీత కార్మికుల మద్యం దుకాణాల లాటరీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 12 దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించడం జరిగిందన్నారు. కోడ్ కారణంగా లాటరీ తీసే కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.
News February 8, 2025
కృష్ణా జిల్లా: తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
News February 7, 2025
ఆత్కూరులో మైనర్ బాలిక సూసైడ్

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.