News February 11, 2025

కృష్ణా: MLC స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా ఈ రోజుతో నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 25, 2025

కృష్ణా: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలో మొత్తం 17 అంగన్వాడీ కార్యకర్త, 82 సహాయకురాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ICDS PD రాణి తెలిపారు. అర్హులైన వారు డిసెంబర్ 3వ తేదీలోపు సంబంధిత CDPO ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21-35సం.ల మధ్య వయసు కలిగి పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలిపారు.

News November 24, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.