News August 29, 2024
కృష్ణా: UG & PG విద్యార్థులకు ముఖ్య గమనిక
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANUCDE)లో డిస్టెన్స్ విధానంలో UG, PG కోర్సులు చదివే విద్యార్థులు(C-24 బ్యాచ్) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ విడులైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 2లోపు చెల్లించాలని వర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు http://anucde.info/ అధికారిక వెబ్సైట్ చూడాలని స్పష్టం చేసింది.
Similar News
News October 7, 2024
కృష్ణా: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 7, 2024
8న విజయవాడలో జాబ్ మేళా
విజయవాడ పట్టణ పరిధిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీ శిక్షణా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 10 నుంచి పీజీ వరకు చదివి 18-35 సంవత్సరాలలోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి రూ.10 నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందన్నారు.
News October 7, 2024
నేడు దుర్గమ్మ ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?
దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.