News March 16, 2025

కృష్ణ: నేడు మంత్రి రాక.. భారీ బందోబస్తు సిద్ధం

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిలువురాళ్ళను సందర్శించడానికి ఆదివారం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి రానున్నట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. శనివారం కృష్ణ మండలం పరిధిలోని ముడుమల్ నిలువురాళ్లు సీఐ సందర్శించి మంత్రి రాకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 16, 2025

ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

image

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

News March 16, 2025

కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్‌తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News March 16, 2025

జిల్లా అధికారులను అభినందించిన జనగామ కలెక్టర్

image

స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను జిల్లా అధికారులందరినీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అభినదించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు గత వారం రోజులుగా నిర్విరామంగా విశేష కృషి చేశారని కలెక్టర్ అన్నారు. అందరి సమన్వయ కృషి వల్లే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.

error: Content is protected !!