News March 24, 2025
కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
Similar News
News October 26, 2025
PDPL: అప్లికేషన్లు తగ్గినా.. ఆదాయం పెరిగింది..!

అదృష్టం ఎవరిని వరిస్తుందో తేలే గడియలు రాబోతున్నాయి. దేవతల పేర్లతో వేసిన టెండర్లను ఆయా దేవతలు దక్కిస్తాయో లేదా వెక్కిరిస్తాయే తేలేది రేపే. జిల్లాలో 74 మద్యం షాపులకు 1,507 దరఖాస్తులు రాగా, ఫీజుల రూపంలో రూ.45.21కోట్ల ఆదాయం వచ్చింది. PDPLలో 20 షాపులకు 442, సుల్తానాబాద్లో 15కి 305, రామగుండంలో 24కి 474, మంథనిలో 15కి 286 దరఖాస్తులొచ్చాయి. గతేడాది దరఖాస్తులు 2,020 వచ్చినా.. ఈ ఏడాది ఆదాయం మాత్రం పెరిగింది.
News October 26, 2025
కరీంనగర్: గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు

కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ గిరిజన యువతకు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ హైదరాబాద్ (డీఈఈటీ) ఆన్లైన్ వెబ్సైట్ ప్లాట్ఫామ్ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి సంగీత తెలిపారు. ఆసక్తిగల గిరిజన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
News October 26, 2025
ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15వ ఫ్లోర్ నుంచి దూకి భర్త ఆత్మహత్య

భార్యతో గొడవల నేపథ్యంలో 15వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారో భర్త. ఫరిదాబాద్(Haryana)లో ఉండే యోగేశ్ కుమార్ 9 ఏళ్ల కిందట నేహాను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కూతురి(6)ని చూసుకోవడానికి ఇటీవల తల్లిని యోగేశ్ పిలిపించుకున్నారు. దీనిపై నేహా, ఆమె ఫ్యామిలీతో యోగేశ్కు గొడవలు జరిగాయి. తాజాగా మళ్లీ వాగ్వాదం జరిగి బిల్డింగ్ పైనుంచి అతడు దూకేశారు. నేహా సహా ఐదుగురిపై కేసు నమోదైంది.


