News March 7, 2025
కెరమెరి: గిరిజన సాహస పుత్రిక కన్నిబాయి

భీమన్ గొందికి చెందిన మడవి కన్నీబాయి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి సాహస క్రీడల్లో సరికొత్త చరిత్ర లిఖించి ఆదివాసీ ముత్యంగా మెరిసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్ వరకు చదివి ఆపేశారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితో పారాసైలింగ్, రాపెలింగ్, జూమరింగ్ క్రీడల్లో సత్తా చాటింది. కాగా ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News November 19, 2025
ఉమ్మడి కరీంనగర్లో BCలకు 268 GPలే..!

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
News November 19, 2025
మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
News November 19, 2025
ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.


