News March 7, 2025
కెరమెరి: గిరిజన సాహస పుత్రిక కన్నిబాయి

భీమన్ గొందికి చెందిన మడవి కన్నీబాయి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి సాహస క్రీడల్లో సరికొత్త చరిత్ర లిఖించి ఆదివాసీ ముత్యంగా మెరిసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్ వరకు చదివి ఆపేశారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితో పారాసైలింగ్, రాపెలింగ్, జూమరింగ్ క్రీడల్లో సత్తా చాటింది. కాగా ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News February 26, 2026
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News February 26, 2026
ఇందిరమ్మ ఇళ్లపై కడియం శ్రీహరి సమీక్ష

జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ఒక్క ఇల్లు కూడా ల్యాప్స్ కాకుండా చూడాలని, సాగునీరు అందక ఒక్క ఎకరం ఎండిపోకూడదని అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్తో సమీక్షలో ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు.
News February 26, 2026
ఎందుకలా?!: షుగర్ ఉన్నవారిలో తరచూ నీరసం..

షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నా అవయవాల్లోని కణాలకు అవసరమైన శక్తి అందక నీరసంగా అన్పిస్తుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ పని చేయకపోవడం. ఇన్సులిన్ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించి కణాలకు శక్తిని అందిస్తుంది. శరీరంలో ఇది తగినంత ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి డయాబెటిస్కు దారి తీస్తుంది. ప్రతిరోజూ 4pmకు ఎందుకలా?!.


