News February 21, 2025

కెరమెరి: చదువుపై దృష్టి సారించాలి: ఐటీడీఏ పీఓ

image

చదువుపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా విద్యార్థులకు సూచించారు. గురువారం కెరమెరి మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రాంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News December 5, 2025

దేవరకొండ ఘటనపై సీఐ వివరణ

image

తిప్పర్తికి చెందిన దుర్గభవాని మనోవేదనకు గురై బుధవారం దేవరకొండ అటవీ శాఖ వాహనంలో బాలుడిని వదిలినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. దుర్గభవాని భర్త సంతోష్ మధ్య వివాదం నెలకొని 3 నెలలు గడుస్తున్నా అత్తవారింటికి తీసుకెళ్లకపోవడంతో మనోవేదనకు గురై తల్లి బాలుడిని ఇక్కడ వదిలినట్లు తెలిపారు. భర్త సంతోష్‌ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు. తల్లీబిడ్డని ఎస్ఐ మౌనిక సఖీ కేంద్రానికి తరలించారు.

News December 5, 2025

HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

image

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.

News December 5, 2025

విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

image

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.