News March 4, 2025

కెరమెరి: హెచ్ఎంపై దాడి.. వ్యక్తిపై కేసు

image

కెరమెరి మండలం హట్టి హై స్కూల్ హెచ్ఎం గన్నుపై సోమవారం దినేశ్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు ఎస్ఐ గుంపుల విజయ్ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న హెచ్ఎంతో గొడవకు దిగిన దినేశ్ తన జేబులో ఉన్న బ్లేడుతో గాయపరిచాడు. హెచ్ఎం గన్ను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దినేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News March 4, 2025

VKB: స్పోర్ట్స్‌ స్కూల్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమిలో కాయకింగ్, కెనోయింగ్, ఫెన్సింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు గిరిజన బాలబాలికల నుంచి అడ్మిషన్లు కోరుతున్నామని ఆ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 5వ తగరతిలో బాలురు10, బాలికలకు 10 సీట్లు ఉండగా, మిగతా 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు ఈ నెల 9 వరకు కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 4, 2025

అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

image

పాల్వంచ వర్తక సంఘ భవనం పక్కన రేగా లక్ష్మి-రవీందర్ దంపతులు గతేడాది నుంచి నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 4, 2025

జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నిలిపేసింది: మంత్రి నిమ్మల

image

AP: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.

error: Content is protected !!