News February 7, 2025
కేంద్రమంత్రితో మంత్రి స్వామి భేటీ

ఢిల్లీలోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్తో శుక్రవారం మంత్రి స్వామి భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. PM AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద, రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు విడుదల చేయాలన్నారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు విడుదల చేయాలని కోరారు.
Similar News
News March 27, 2025
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్సీ, పీహెచ్సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.
News March 27, 2025
ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్ను పరిశీలించాలి. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News March 27, 2025
ఒంగోలులో ఇఫ్తార్ విందు కార్యక్రమం

ఒంగోలులో జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘంశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని గోపాలస్వామి కళ్యాణమండపంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మంత్రి స్వామి, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.