News November 28, 2024

కేంద్రమంత్రి దృష్టికి విశాఖ ఉక్కు కార్మికుల సమస్య 

image

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామిని న్యూఢిల్లీలో ఆయన కార్యాలయంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై మంత్రితో ఎంపీ చర్చించారు. ముఖ్యంగా ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్టిల్ ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేస్తున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు.

Similar News

News October 22, 2025

విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.

News October 22, 2025

గంటా శ్రీనివాస్ జోక్యంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్

image

చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మెట్రో ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.3.23 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణంపై మెట్రో అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో గంటా సమస్యను వివరించి మెట్రో డిజైన్‌ను బ్రిడ్జి కంటే ఎత్తులో ఖరారు చేయించారు.

News October 21, 2025

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

image

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.