News December 7, 2024

కేంద్రీయ విద్యాలయాల ఆమోదం పట్ల ఎంపీ లావు హర్షం 

image

దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

Similar News

News January 14, 2025

రేపు గుంటూరు రానున్న బాబీ, తమన్

image

గుంటూరు ఐటీసీ హోటల్ నుంచి మైత్రి మూవీస్ వరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న బైక్ ర్యాలీలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొంటారని గుంటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు బెల్లంకొండ సురేశ్ మంగళవారం తెలిపాడు. అనంతరం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను అభిమానులతో బాబీ, తమన్, డిస్టిబూటర్స్ చూడనున్నారని తెలిపారు. ఈ ర్యాలీని బాలయ్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.

News January 14, 2025

చేనేతలపై అభిమానాన్ని చాటుకున్న మంత్రి లోకేశ్

image

చేనేతలపై అభిమానాన్ని మంత్రి లోకేశ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లిన లోకేశ్, భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.

News January 14, 2025

రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు వాసులు విజయం

image

సంక్రాతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామ పల్లెకారులు విజయం సాధించారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా గోదావరి జిల్లాల్లో పడవల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న రామాపురం మత్స్యకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.