News March 7, 2025
కేంద్ర ఐటీ చట్టం పౌరుల గోప్యతకు ముప్పు: KTR

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పు అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారలున్నాయని, నూతన చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఇది దేశ ప్రజల డిజిటల్ హక్కులపైన కేంద్రం చేస్తున్న దాడి, దేశ ప్రజలు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 14, 2025
45 వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్

ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. జూబ్లీహిల్స్లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని ఆశించారు. 45 వేల మెజారిటీతో గెలుస్తున్నామని నవీన్ యాదవ్ తెలిపారు. అయితే, ఆయన ఆశించిన స్థాయిలోనే 4 రౌండ్లలో INC లీడ్లో ఉంది.
News November 14, 2025
HYD: 750 వాహనాలు సీజ్: ఆర్టీఏ అధికారులు

నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రెండు రోజులుగా 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో 750 వాహనాలను సీజ్ చేశామని, ఓవర్ లోడ్ వాహనాలను క్వారీలు, రీచ్ల వద్దనే నియంత్రించేందుకు మైనింగ్ శాఖకు ఆర్టీఏ అధికారులు సిఫార్సు చేశారు.
News November 14, 2025
Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

జూబ్లీహిల్స్ బైపోల్ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్లో నవీన్ యాదవ్కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్లో 42 బూత్లలో పోలైన ఓట్లను లెక్కించారు.


