News March 7, 2025
కేంద్ర ఐటీ చట్టం పౌరుల గోప్యతకు ముప్పు: KTR

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పు అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారలున్నాయని, నూతన చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఇది దేశ ప్రజల డిజిటల్ హక్కులపైన కేంద్రం చేస్తున్న దాడి, దేశ ప్రజలు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 24, 2025
ఆవు పాలు తాగడంతో మహిళకు రేబిస్.. మృతి

ఆవు పాలు తాగిన మహిళకు రేబిస్ సోకి మృతి చెందిన ఘటన UP నోయిడాలో జరిగింది. దీనిపై ప్రముఖ వైద్యుడు సుధీర్ అవగాహన కల్పించారు. ‘నోయిడాలో వీధి కుక్క కరవడంతో ఆవుకు రేబిస్ సోకింది. దాని పచ్చి పాలు తాగడంతో మహిళ కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఇలాంటి కేసు ఇదే తొలిసారి. రేబిస్ సోకిన ఆవు పచ్చి పాలు తాగితే టీకా వేసుకోవాలి. పచ్చి పాలు ఎప్పుడూ తీసుకోవద్దు. మరగబెట్టాక తాగడమే సురక్షితం’ అని ఆయన ట్వీట్ చేశారు.
News March 24, 2025
చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్

APలో తమిళ మీడియం పాఠశాలలు ఉండటం సంతోషమని BJP నేత తమిళి సై చేసిన ట్వీట్కు DyCM పవన్ స్పందించారు. ‘చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది. AP భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తోంది. తమిళంతో సహా వివిధ మాధ్యమాల్లో 1,610 పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషను కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 24, 2025
రాహుల్ గాంధీతో డేట్ చేయాలనుకున్నా: బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం కాంట్రవర్సీకి దారి తీయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. తరచుగా RG ఫొటోలను చూసేదాన్నని పేర్కొన్నారు. తమ కుటుంబాల బ్యాగ్రౌండ్ అందరికీ తెలిసిందేనని చెప్పారు. కాగా 2012లో సైఫ్ను కరీనా పెళ్లి చేసుకున్నారు.