News April 12, 2025

కేంద్ర నిధులు సమర్థవంతంగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే కడియం 

image

జనగామ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు నాలాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని సూచించారు.

Similar News

News November 18, 2025

రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.

News November 18, 2025

ములుగు: పోలీసుల అదుపులో దేవ్ జీ..?

image

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఉన్నట్లు తెలుస్తోంది. మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీతో పాటు మరి కొంత మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వినవస్తుంది. రేపు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

News November 18, 2025

పెనాల్టీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మేయర్

image

అసెస్‌మెంట్‌లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగర వాసులు, ఈ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా కౌన్సిల్ హాల్‌లో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు సూచనలు చేశారు.