News January 9, 2025

కేంద్ర ప్రభుత్వం రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయం: బాపట్ల కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ పిఎంఏ వై 2.0 పథకం క్రింద ఇల్లు నిర్మించుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల-2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. సందర్భంగా అధికారులకు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.

Similar News

News January 20, 2025

23న విద్యార్థులకు పోటీలు: DEO

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘nothing like voting, 1 vote for sure’ అనే అంశంపై ఈనెల 23న వ్యాసరచన, వక్తృత్వ, స్లోగన్ రైటింగ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం తెలిపారు. పాత బస్టాండ్ వద్దనున్న ఉర్థూ బాలుర పాఠశాలలో ఉదయం 9.30గంటలకు  పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 25న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. 

News January 20, 2025

జెస్సీ రాజ్‌కు కలెక్టర్‌ అభినందనలు

image

ప్రపంచ స్కేటింగ్‌ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న గుంటూరు జిల్లాకి చెందిన జెస్సీరాజ్‌ను కలెక్టర్‌ నాగలక్ష్మీ అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లో జెస్సీరాజ్‌ను సన్మానించిన ఆమె, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి గుంటూరు ఖ్యాతిని పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో నరసింహారెడ్డి పాల్గొన్నారు. 

News January 20, 2025

గుంటూరు: ANU డిగ్రీ ఫలితాలు విడుదల

image

నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయీద్ జైన్ లాబ్దిన్ తెలిపారు. ఫలితాలను సోమవారం వైస్ ఛాన్సలర్ గంగాధరరావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఫిబ్రవరి 3లోపు రీవాల్యూవేషన్‌కు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.