News February 2, 2025

కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు

image

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.

Similar News

News December 9, 2025

జగిత్యాల: నేటితో ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..!

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాలలో నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంది. ఇప్పటికే మందు, విందులతో జోరుగా దావతులు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి పలువురు అభ్యర్థులు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

News December 9, 2025

విజయ్‌ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

image

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్‌, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.

News December 9, 2025

బాపట్ల జిల్లాలో జాతీయ స్థాయి యోగా పోటీలు

image

బాపట్ల జిల్లా జాతీయ స్థాయి యోగాసన పోటీలకు వేదిక కానుంది. బాపట్ల మండలం జిల్లెల్లమూడిలో డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. మంగళవారం ఆయన వేదికను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు వసతి కల్పిస్తున్నామన్నారు. యోగా విశిష్టతను చాటేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.