News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై అనగాని హర్షం

రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు జరిగాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్కు కొత్త ఊపిరి నిచ్చేలా నిధులు కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 13, 2025
వెల్గటూర్: స్నానానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి

వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరి నదిలో శనివారం గోలెం మల్లయ్య (53) అనే వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. గొల్లపల్లి మండలం గంగాపూర్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తూ స్నానం కోసం నదిలోకి దిగిన మల్లయ్య ఈదుతూ లోతుకు వెళ్లి శక్తి సరిపోక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి గంటపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News December 13, 2025
VZM: ఉమ్మడి జిల్లాలో 9,513 కేసుల పరిష్కారం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 9,513 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్లో సివిల్ 424, క్రిమినల్ 9,028, ప్రీ-లిటిగేషన్ 61 కేసులు పరిష్కారమయ్యాయని సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్కు రూ.90 లక్షల పరిహారం అందజేశారు.
News December 13, 2025
రెండో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి: మెదక్ కలెక్టర్

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీని ఆయన పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సిబ్బంది మార్గదర్శకాలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు, అనంతరం లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.


