News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై అనగాని హర్షం

రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు జరిగాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్కు కొత్త ఊపిరి నిచ్చేలా నిధులు కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 17, 2025
2026 JANలో HYD-విజయవాడ NH విస్తరణ

TG: HYD-విజయవాడ NH65 విస్తరణ పనులు 2026 JANలో ప్రారంభం కానున్నాయి. 6 లేన్లుగా దీని విస్తరణకు DPR ఖరారైంది. పనులకు టెండర్లనూ పిలిచారు. ఈ నెలాఖరున ఇవి ఫైనల్ అవుతాయి. దాదాపు ₹10,000 CRతో 231 KMమేర విస్తరణ చేస్తారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ROBలు, అండర్పాస్లు కూడా హైవే విస్తరణ పనులలో భాగంగా ఉంటాయి. హైవే విస్తరణలో 33 ప్రధాన జంక్షన్లు, 105 చిన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తారని అధికారులు తెలిపారు.
News November 17, 2025
బాపట్ల బీచ్ అభివృద్ధికి ఒప్పందం.. వెయ్యి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

విశాఖపట్నంలో జరిగిన CII సదస్సులో గుంటూరు జిల్లా కి చెందిన భ్రమరా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. బాపట్ల సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతంలో సుమారు రూ.360 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు సంస్థ ఛైర్మన్ గల్లా రామచందర్రావు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News November 17, 2025
మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.


