News July 23, 2024

కేంద్ర బడ్జెట్ ఆశాజనకం: ఎంపీ ఉదయ్

image

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌కు ఆశాజనకంగా ఉందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తికి నిధులు కల్పించడం సంతోషకరమన్నారు.

Similar News

News October 8, 2024

పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం

image

పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. స్టువర్టుపేటలో ఓ బాలిక నడిచివెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆటోలో మాధవపురం డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. కాసేపయ్యాక ఆమెను ఆటోలో ఎక్కిస్తుండగా ఓ మహిళ చూసి నిలదీసింది. బాలిక బంధువులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకొన్నారు. మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా CI శ్రీనివాస్, SI మణికుమార్ కేసు నమోదుచేశారు.

News October 8, 2024

అన్నవరం: సత్యనారాయణ స్వామి ప్రసాదంలో విజయ నెయ్యి..!

image

తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఇక నుంచి విజయ నెయ్యిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్ గడువు ముగియడంతో దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఈ నెయ్యినే వినియోగించనున్నట్లు సమాచారం.

News October 8, 2024

తూ.గో: 9న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న నాదెండ్ల

image

తూ.గో.జిల్లా కాపవరం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాధిక తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కందుల దుర్గేశ్, కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొంటారన్నారు.