News February 1, 2025
కేంద్ర బడ్జెట్.. మాజీ మంత్రి బుగ్గన స్పందన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ‘బడ్జెట్లో ఏపీ కంటే బిహార్కే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ సంతృప్తిని ఇవ్వలేదు. బిహార్ కంటే ఏపీకే ఎక్కువ కేటాయింపులు జరగాలి. ఏపీ పునర్ విభజనలో కూడా అన్యాయం జరిగింది.’ అని పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
మీ ఇంట్లో ఇవి ఉంటే లక్ష్మీదేవి రాదు: పండితులు

శుభ్రంగా ఉండే ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుందని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. పగిలిన కప్పులు/ప్లేట్లు, పాత వార్తాపత్రికలు, కాలం చెల్లిన ఆహారం/మందులు, వాడని దుస్తులు, చనిపోయిన మొక్కలు, పనిచేయని ఎలక్ట్రానిక్స్, ప్రతికూల జ్ఞాపకాలు ఉన్న వస్తువులను వెంటనే తొలగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని అంటున్నారు. తద్వారా మానసిక ఆందోళన దూరమై ఇంట్లో శ్రేయస్సు, సంపద లభిస్తుందని అంటున్నారు.
News December 10, 2025
సౌతాఫ్రికా చెత్త రికార్డ్

నిన్న భారత్తో జరిగిన తొలి T20లో ఓటమితో SA జట్టు చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఆరుసార్లు 100 పరుగుల లోపు ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఇందులో మూడుసార్లు భారత్ ప్రత్యర్థి కావడం గమనార్హం. 2022లో 87 రన్స్, 2023లో 95 పరుగులకే SA ఆలౌటైంది. నిన్నటి మ్యాచ్లో 74 రన్స్కే ప్రొటీస్ బ్యాటర్లు చాప చుట్టేశారు. అలాగే IND చేతిలో అతి ఎక్కువసార్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్ల జాబితాలో SA 4వస్థానంలో ఉంది.
News December 10, 2025
తిరుపతి: ఐదుగురి స్టేట్మెంట్ రికార్డు

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా పోలీసులు ఐదుగురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వర్సిటీకి సంబంధించి నలుగురు కాగా.. ఒడిశాలో యువతి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా వెళ్లిన సీఐ బుధవారం తెల్లవారుజామున తిరుపతికి రానున్నారు. ఆ తర్వాత పక్కా ఆధారాలతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.


