News February 1, 2025

కేంద్ర మంత్రితో బాపట్ల ఎంపీ భేటీ

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం రూ.11,440 కోట్లు కేటాయించినందుకు ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలను ప్రస్తావించారు.

Similar News

News February 13, 2025

సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా? ఇలా చేయండి

image

TG: రాష్ట్రంలో ఇంకా 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని భట్టి విక్రమార్క తెలపగా సర్వే సమయంలో తమ ఇంటికి సిబ్బందే రాలేదని చాలామంది చెబుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బందే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి స్పష్టం చేశారు. మండల కార్యాలయాల్లో ఈనెల 16-28 మధ్య అందుబాటులో ఉండే అధికారులకు, ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

News February 13, 2025

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది: ఎర్రబెల్లి

image

రానున్న ఆరు నెలల్లో కాంగ్రెస్ కూలిపోతుందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పెద్దవంగర మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ బూటకపు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. 

News February 13, 2025

పల్వంచ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ మండలానికి చెందిన కుర్ర వెంకట్(25) అనే యువకుడు 3 నెలల క్రితం చెరుకు కొట్టడానికి వచ్చి గుడిసె వేసుకున్నాడు. కాగా ప్రమాదవశాత్తు గుడిసెకు విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్‌తో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఏస్ఐ అనిల్ తెలిపారు.

error: Content is protected !!