News April 3, 2025

కేంద్ర మంత్రిని కలిసిన ADB ఎంపీ, ఎమ్మెల్యేలు

image

ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయానికి భారత వైమానిక దళం ఆమోదం తెలపడం పట్ల ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి సత్కరించారు. వీలైనంత త్వరగా ADB విమానాశ్రయం అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Similar News

News December 4, 2025

కామారెడ్డి: డీజీపీకి పూల మొక్కను అందజేసిన కలెక్టర్

image

డీజీపీ శివధర్ రెడ్డిని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

News December 4, 2025

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: డిజిపి

image

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News December 4, 2025

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ: హోం మంత్రి

image

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు గుర్తింపు పొందిన సందర్భంగా బీచ్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి అనిత పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. మహళల భద్రతే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని, సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయన్నారు. శక్తి టీమ్స్, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పోలీసులను మంత్రి అనిత అభినందించారు.