News April 3, 2025

కేంద్ర మంత్రిని కలిసిన ADB ఎంపీ, ఎమ్మెల్యేలు

image

ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయానికి భారత వైమానిక దళం ఆమోదం తెలపడం పట్ల ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి సత్కరించారు. వీలైనంత త్వరగా ADB విమానాశ్రయం అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Similar News

News November 3, 2025

వారసత్వ రాజకీయాలపై శశిథరూర్ తీవ్ర విమర్శలు

image

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని కాంగ్రెస్ MP శశిథరూర్ విమర్శించారు. భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారాలుగా మారాయన్నారు. ‘దశాబ్దాలుగా ఒకే ఫ్యామిలీ ఆధిపత్యం చెలాయిస్తోంది. నెహ్రూ-గాంధీ డైనస్టీ ప్రభావం స్వతంత్ర పోరాటంతో ముడిపడి ఉంది. కానీ రాజకీయ నాయకత్వం జన్మహక్కు అనే ఆలోచన పాతుకుపోయేలా చేసింది’ అని ఓ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో రాహుల్, తేజస్వీపై థరూర్ నేరుగా అటాక్ చేశారని BJP చెప్పింది.

News November 3, 2025

ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించండి: కలెక్టర్

image

ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుంచి వచ్చిన వినతులను వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

News November 3, 2025

యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

image

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.