News February 4, 2025
కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ NZB అధ్యక్షుడు
బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన దినేష్ కులచారి మంగళవారం కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు కులచారికి సూచించారు.
Similar News
News February 4, 2025
డిచ్పల్లి: చెరువులో పడి పశువుల కాపరి మృతి
డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి చెరువులో పడి పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. సోమవారం గ్రామానికి చెందిన బియ్యం బాబయ్య పశువులను మేపేందుకు గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. గేదలు చెరువులోకి దిగగా వాటికోసం చెరువు వద్దకు వెళ్లిన బాబయ్య ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
News February 4, 2025
ఆర్మూర్: మెరుగైన వైద్య సేవలందించాలి: DMHO
నిజామాబాద్ జిల్లా DMHO రాజశ్రీ మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. ఆసుపత్రి రిజిస్టర్లను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్, డాక్టర్ ప్రవీణ్, ఆనంద్, LT కృష్ణ, ఫార్మసిస్టు సురేశ్, తదితరులు ఉన్నారు.
News February 4, 2025
NZB: రైతును బురిడీ కొట్టించి నగదు స్వాహా
రైతును బురిడీ కొట్టించి ఓ కేటుగాడు ATM కార్డు ద్వారా నగదు స్వాహా చేసిన ఘటన నిజామాబాద్లో జరిగింది. మోపాల్ మండలానికి చెందిన గంగారెడ్డి అనే రైతు రెండు రోజుల కిందట నిజామాబాద్లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లి అక్కడ ఉన్న ఓ వ్యక్తి సహాయంతో రూ.5 వేలు డ్రా చేశాడు. ఈ సమయంలో ఆ కేటుగాడు వేరే కార్డు ఇచ్చి రైతును మోసం చేసి అనంతరం రూ.30 వేలు డ్రా చేశాడు. మేసేజ్లు రావడంతో రైతు పోలీసులను ఆశ్రయించారు.