News October 27, 2024

కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా వేమిరెడ్డి

image

కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈయనకు మాత్రమే ఈ అవకాశం లభించింది. కాగా తనకు బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనేక కీలక పదవులు లభించడంతో జిల్లా వాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Similar News

News February 25, 2026

రేపే నెల్లూరుకు జగన్.. టైమింగ్స్ ఇవే!

image

మాజీ సీఎం జగన్ నెల్లూరులో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గొలగమూడి రోడ్డులోని VPR కన్వెన్షన్ హాలుకు వస్తారు. అక్కడ వివాహ వేడుకల్లో పాల్గొని 10.45 గంటలకు బెంగళూరు వెళ్తారు.

News February 25, 2026

వలేటివారిపాలెం: జనార్ధన స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు

image

వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు రెండు మూడు సార్లు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చారిత్రక దేవాలయాలను కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

News February 25, 2026

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కేంద్రాలను కలెక్టర్ హిమాన్సు శుక్లా తనిఖీ చేశారు. నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు. విద్యార్థుల సందేహాల కొరకు ఐఆర్‌ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.