News October 27, 2024

కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా వేమిరెడ్డి

image

కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈయనకు మాత్రమే ఈ అవకాశం లభించింది. కాగా తనకు బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనేక కీలక పదవులు లభించడంతో జిల్లా వాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Similar News

News October 27, 2025

భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే.!

image

☞ నెల్లూరు కలెక్టరేట్: 0861 2331261, 7995576699
☞ కందుకూరు సబ్‌ కలెక్టరేట్: 7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు: 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215
☞ కావలి RDO ఆఫీసు: 7702267559
☞ ఆయా పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.

News October 27, 2025

నెల్లూరు: రేపు కూడా స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీలకు సెలవును మరో రోజు పొడిగిస్తున్నట్లు నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లతోపాటు అంగన్వాడీలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం సైతం తుఫాన్ ప్రభావం ఉండనుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 27, 2025

మొంథా ఎఫెక్ట్.. నెల్లూరుకు రూ.కోటి నిధులు

image

మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.