News October 27, 2024

కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా వేమిరెడ్డి

image

కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈయనకు మాత్రమే ఈ అవకాశం లభించింది. కాగా తనకు బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనేక కీలక పదవులు లభించడంతో జిల్లా వాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Similar News

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

News December 3, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

image

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.