News February 1, 2025
కేక్ కొనేందుకు వెళుతూ ముగ్గురు స్పాట్ డెడ్

గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కొర్నేపాడు గ్రామానికి చెందిన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు స్నేహితులు ఒకే బైక్పై కేక్ కొనుగోలు చేసేందుకు వెళుతూ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించారు. ఈ ప్రమాదంతో ముగ్గురు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక పోలీసులు తెలిపారు.
Similar News
News February 13, 2025
ఎమ్మెల్సీ ఓటుకు ఈ ధృవపత్రాలు తప్పనిసరి: కలెక్టర్

గుంటూరు-కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి EPIC కార్డ్ లేని పక్షంలో ప్రత్యామ్నాయ ధృవపత్రాలు చూపించవచ్చని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఉద్యోగుల సేవా గుర్తింపు కార్డ్, MP/MLA/MLCలు, విద్యాసంస్థలు జారీచేసిన సేవా గుర్తింపు కార్డులతో పాటూ వర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్స్ చూపాలన్నారు.
News February 12, 2025
కొల్లిపరలో భారీ కొండ చిలువ

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
News February 12, 2025
గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!

గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.