News March 12, 2025
కేజీబీవీని తనిఖీ చేసిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిశాలను పరిశీలిస్తూ.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News January 8, 2026
HYDలో నేను ఎక్కడ నడవాలి? చెప్పండి ప్లీజ్!

‘నాకు కారులేదు. బండి లేదు. సైకిల్ కూడా లేదు. అందుకే నేను నడుచుకుంటూ వెళ్లాలి. మరి ఎలా వెళ్లాలి? మహానగరంలో ఎక్కడ చూసినా రోడ్లే. నేను నడవాలంటే రోడ్లపై నడవాల్సిందేనా? సిటీలో దాదాపు 10వేల KM రోడ్లు ఉంటే నడవడానికి 550 KM ఫుట్పాత్ ఉంది. ఇదేం పద్ధతి? ఎక్కడ చూసినా ఆక్రమణలే.. వ్యాపారులు, సామగ్రి, పాన్ డబ్బాలు ఆక్రమించాయి? నేను నడిచేందుకు దారి చూపించండి సార్.. అంటూ ఓ నగరవాసి చేసిన విన్నపం ఇది.
News January 8, 2026
పసుపు పంట కోత – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పసుపు తవ్వడానికి 2 రోజుల ముందే మొక్క ఆకులు, కాండాలను భూమట్టానికి కోయాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని ఇచ్చి 2 రోజుల తర్వాత నుంచి పసుపు తవ్వకం ప్రారంభించాలి. తవ్వగా ఇంకా దుంపలు భూమిలో మిగిలిపోతే నాగలితో దున్ని ఏరాలి. పంటను తీసేటప్పుడు కొమ్ములకు దెబ్బ తగలకుండా చూసుకోవాలి. పసుపు దుంపలను ఏరాక మట్టిని తొలగించాలి. తర్వాత తల్లి, పిల్ల దుంపలు వేరుచేసి, తెగుళ్లు ఆశించిన దుంపలను పక్కకు తీసేయాలి.
News January 8, 2026
ED రైడ్స్.. ప్రతీక్ ఇంటికి CM మమత

IPAC కోఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి TMCకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ను ED స్వాధీనం చేసుకుందని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఇవాళ ఉదయం కోల్కతాలోని ప్రతీక్ ఇంటిపై ED <<18796717>>దాడులు<<>> చేసింది. దీంతో మమత ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంలో ఈ కామెంట్లు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల వివరాలు ఉన్న ఫైల్స్ను ఈడీ అధికారులు తీసుకెళ్లారని మండిపడ్డారు.


