News March 12, 2025
కేజీబీవీని తనిఖీ చేసిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెడుతున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిశాలను పరిశీలిస్తూ.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Similar News
News December 20, 2025
సిద్దిపేట: దరఖాస్తుల ఆహ్వానం

సిద్దిపేట జిల్లాలోని 225 పాఠశాలల్లో విద్యార్థినిలకు ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ’లో కరాటే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 నెలలు సాగే ఈ శిక్షణ కోసం అర్హులైన మహిళా కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలికల్లో ఆత్మస్థైర్యం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.
News December 20, 2025
నంద్యాల: ALL THE BEST హసీనా, అంకిత

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలో నంద్యాల జిల్లా క్రీడాకారులు హసీనా, అంకిత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కోచింగ్కు ఎంపికయ్యారు. శిక్షణలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తారని స్పాన్సర్ వసుంధర దేవి తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి వీరిద్దరే ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చూపడం హర్షణీయమన్నారు.
News December 20, 2025
సిద్దిపేట: స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నాగరాజమ్మ తెలిపారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జెర్మనీ, జపాన్, సింగపూర్, న్యూజీలాండ్ దేశాలలోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారు అర్హులన్నారు. www.telanganaepass.cgg.gov.inలో 01-19-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.


