News March 11, 2025

కేటీఆర్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి: శ్రీధర్ బాబు

image

కేటీఆర్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని ఐటి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్ వార్డ్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ హుందాగా వ్యవహరించాలని, లేదంటే ప్రజల్లో చులకనఅవుతారన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు.

Similar News

News January 18, 2026

ఇవాళ ఈ తప్పులు అస్సలు చేయకండి!

image

నేడు మౌని అమావాస్య కావడంతో సముద్ర/గంగానది స్నానం, ఉపవాసం, మౌనవ్రతం, పూర్వీకులకు తర్పణం, దానాలు చేయడం మంచిది. వ్రత ఫలితం దక్కాలంటే ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘కోపం తెచ్చుకోవడం, ఆర్గ్యుమెంట్స్, అనవసర సంభాషణలు, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, నెగటివ్ థింకింగ్ మానుకోవాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని సూచిస్తున్నారు.

News January 18, 2026

నేడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

image

డబ్బు చేతిలో నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణావర్త శంఖంలో పోసి పూజగదిలో ఉంచాలి. అనంతరం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించాలి. చొల్లంగి సంగమ స్నానం తర్వాత చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.

News January 18, 2026

WC మ్యాచెస్‌పై ICCకి బంగ్లా మరో రిక్వెస్ట్

image

T20WC మ్యాచెస్ కోసం భారత్ వెళ్లేదిలేదని బంగ్లాదేశ్ ICCకి తేల్చి చెప్పింది. పలు చర్చల తర్వాత కూడా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాల్సిందే అంటోంది. దీనిపై వచ్చే వారం ICC తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ICCకి BCB కొత్త రిక్వెస్ట్ పెట్టింది. ఐర్లాండ్‌తో గ్రూపులు స్వాప్ చేసుకుంటామని చెప్పింది. ఐర్లాండ్ గ్రూప్ Bకి వస్తే, BAN గ్రూప్ Cకి వెళ్తుంది. అప్పుడు గ్రూప్ మ్యాచులు కొలంబో, పల్లెకెలెలో ఆడే వీలుంటుంది.