News November 8, 2024

కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!

image

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని, ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 20 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం.

Similar News

News December 12, 2025

టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

image

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.

News December 11, 2025

BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

image

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 11, 2025

అనంతపురం కలెక్టర్‌కు 22వ ర్యాంకు

image

అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌కు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 22వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 930 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 863 ఫైల్స్ క్లియర్ చేశారు. ఈయన ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 5 రోజుల 22 గంటల సమయం తీసుకున్నారు.