News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

Similar News

News December 5, 2025

నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర పొత్తులు!

image

తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తాము బలపరుస్తున్న అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులకు చర్చలు మొదలు పెట్టాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీ అభ్యర్థులు మద్దతునిస్తుండగా మరికొన్ని గ్రామాల్లో BRS, BJP,CPM,CPIలు సహకరించుకుంటున్నాయి. కాంగ్రెస్, CPI, CPM కూడా వివిధ గ్రామాల్లో ఆయా పార్టీల ప్రాబల్యాన్ని బట్టి ఒక అవగాహనతో ముందుకెళ్తున్నాయి.

News December 5, 2025

NGKL: జిల్లాలో స్వల్పంగా పెరిగిన చలి

image

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటలో చారకొండ మండలంలో17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ మండలంలో 18.4, పదర మండలంలో 19.6, కల్వకుర్తి మండలంలో 19.8, బల్మూరు మండలంలో19.9, ఊర్కొండ మండలంలో 19.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

News December 5, 2025

పల్నాడు: 28 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి

image

పల్నాడు జిల్లాలో 28 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ కృత్తికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు గ్రేడులు కేటాయించి పోస్టింగ్‌లు కల్పించినట్లు నియామకపు ఉత్తర్వులలో తెలిపారు. ఎడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల, వినుకొండ, దాచేపల్లి, తదితర మండలాలకు కేటాయించారు.