News February 17, 2025
కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.
Similar News
News November 22, 2025
ADB: కారు జోరు.. కాంగ్రెస్ ఇలా.. బీజేపీ డీలా..!

రాష్ట్రంలో అన్ని ప్రధాన ఎన్నికల్లో ఓటమి చూసిన కారు పార్టీ ADBలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. తరచూ వివిధ సమస్యలపై ఆందోళన నిర్వహిస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటోంది. అభివృద్ధి తమ మంత్రమని కాంగ్రెస్ వివిధ పనులు చేస్తూ ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ కార్యక్రమాలు అంతంతగానే ఉన్నాయి. ఇక బీజేపీ హిందుత్వపరంగా బలంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలు అంతగా కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 22, 2025
ఇల్లంతకుంట: ‘అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర’

ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, మహిళల ఆత్మ గౌరవానికి తోడ్పడుతుందని మానకొండూర్ MLA సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట రైతు వేదికలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా మానకొండూర్ MLA కవ్వంపల్లి పాల్గొన్నారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.
News November 22, 2025
అయిజ: రైతులను ప్రోత్సహించేందుకే సంబరాలు

రైతులను వ్యవసాయపరంగా ప్రోత్సహించేందుకు రైతు సంబరాలు నిర్వహిస్తున్నట్లు అయిజ సింగల్ విండో మాజీ ఛైర్మన్ సంకాపూర్ రాముడు పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో వెలసిన వరాహ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆలయ ప్రాంగణంలో అంతర్రాష్ట్ర న్యూ కేటగిరి విభాగం బండలాగు పోటీలు ప్రారంభించారు. వ్యవసాయంలో ప్రధానమైన ఎడ్ల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


