News April 8, 2025

కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Similar News

News October 30, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 30, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 30, 2025

తాజా సినిమా ముచ్చట్లు

image

✦’అరుంధతి’ సినిమా హిందీలోకి రీమేక్? ప్రధాన పాత్రలో శ్రీలీల నటించనున్నట్లు టాక్
✦ నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్యూడ్’ సినిమా స్ట్రీమింగ్?
✦ తెలుగు డైరెక్టర్ పరశురామ్‌తో సూర్య సినిమా చేసే అవకాశం?
✦ ‘రిపబ్లిక్’ సినిమాకు సీక్వెల్.. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది: సాయి దుర్గ తేజ్
✦ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా

News October 30, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.