News February 20, 2025
కేయూ: పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష వాయిదా

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి సంబంధించిన <<15507872>>పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష<<>> వాయిదా పడింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీన నిర్వహిస్తామని, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి, ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
Similar News
News November 13, 2025
జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు..!

జిల్లా రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ గురించి సరిగా తెలియకపోవడం, తెలిసినా అందులో ఫార్మర్ నాట్ రిజిస్టర్ అని చూపించడం, ఎవరి పేరు మీద ఎంత పత్తి ఉందో, ఎంత వరి ఉందో తెలియకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకొని వారికి వెంటనే రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.
News November 13, 2025
నేటి నుంచే అరకు-యెలహంకా ప్రత్యేక ట్రైన్లు

నేటీ నుంచే దువ్వాడ మీదుగా అరకు-యెలహంకా మధ్య స్పెషల్ ట్రైన్లు (08551/08552), (08555/08556) నడవనున్నాయి. ఈనెల 13, 17, 23, 24 తేదీల్లో అరకు నుంచి మ.12కి స్పెషల్ ట్రైన్ బయలుదేరుతుంది. తిరుగుపయనం ఈనెల 14, 24, తేదీల్లో యెలహంకా నుంచి మ.1.30 గంటకి, అదేవిధంగా 18, 25 తేదీల్లో యలహంక నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
News November 13, 2025
రాష్ట్రంలో రూ.82వేల కోట్లు పెట్టుబడి: లోకేశ్

AP: బిగ్ అప్డేట్ ఏంటో మంత్రి లోకేశ్ రివీల్ చేశారు. రెన్యూ(ReNew) ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విశాఖలో జరిగే CII భాగస్వామ్య సదస్సుకు ఆ సంస్థ బృందానికి మంత్రి ఆహ్వానం పలికారు.


