News July 26, 2024
కేయూ పీజీ 2వ సెమిస్టర్ టైం టేబుల్ విడుదల

కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండవ సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండవ పేపర్, 12న మూడవ పేపర్, 14న నాల్గవ పేపర్, 16న ఐదవ పేపర్, 19న ఆరవ పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2.00 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
Similar News
News November 15, 2025
WGL: టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు పొడిగింపు

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 21 నుంచి 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువైతే రూ.125, వొకేషనల్ వారికి అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫీజులు కేవలం www.bse.telangana.gov.inలో లాగిన్ ద్వారా చెల్లించాలని సూచించారు.
News November 15, 2025
పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
News November 15, 2025
మహబూబాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులోని జడ్పీ హై స్కూల్లో సోషల్ టీచర్గా పని చేస్తున్న రవి 10 రోజులుగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితో చెప్పింది. ఆమె ఫిర్యాదుతో టీచర్పై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.


