News February 18, 2025
కేయూ: 105 మంది విద్యార్థినులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్లో ఇద్దరు, డిజిగీక్స్ ముగ్గురు, జెన్పాక్ట్ 35 మంది, డెల్ఫిటీవీఎస్ 18 మంది, క్యూస్ప్రైడర్ 33 మంది, పెంటగాన్ స్పేస్ 10 మంది, ఎకోట్రైన్స్లో నలుగురు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.
Similar News
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు.
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు.
News November 18, 2025
మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్పై కూర్చొని రామ్చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.


