News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 26, 2026
HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్లైన్

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్లైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.
News February 26, 2026
సూర్యాపేటలో 298 మ్యూల్ అకౌంట్స్ గుర్తింపు

TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. గతంలోనూ పలు గ్రామాల్లో సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
News February 26, 2026
క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, హన్మకొండ, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఖమ్మం డీవైఎస్వో సునీల్ రెడ్డి తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుండి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు 96036 49969 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.


